దర్గా అభివృద్ధికి కృషి చేస్తా: మదన్రెడ్డి
ABN, First Publish Date - 2022-05-22T05:02:13+05:30
మండలంలోని కాసాల గ్రామ శివారులోని హజరత్ సయ్యద్ అజీజుద్దీన్ సూఫీ రిజ్వాని బాబా దర్గా అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు.
హత్నూర/కౌడిపల్లి, మే 21: మండలంలోని కాసాల గ్రామ శివారులోని హజరత్ సయ్యద్ అజీజుద్దీన్ సూఫీ రిజ్వాని బాబా దర్గా అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి ఉర్సు ఉత్సవాల్లో ఎమ్మెల్యే మదన్రెడ్డి రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ దేవేందర్రెడ్డి తదితరులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గా అభివృద్ధికి తనవంతు సహాయం ఎల్లవేళలా ఉంటుందన్నారు. శనివారం కౌడిపల్లిలోని జిల్లా పరిషత్ పాఠశాలలో నారయణ మల్లారెడ్డి అసుపత్రి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్యశిబిరాన్ని ఎమ్మెల్యే మదన్రెడ్డి ప్రారంబించారు. 230 పైగా మందికి వైద్య సేవలను అందించామని క్యాంప్ ఆర్గనైజింగ్ ఆఫీసర్ వెంకటేశం అన్నారు. వైద్య శిబిరంలో సర్పంచ్ వెంకటేశ్వర్రెడ్డి, ఎంపీపీ నవీన్ గుప్తా, వైద్యులు పాల్గొన్నారు.
Updated Date - 2022-05-22T05:02:13+05:30 IST