చేగుంట అభివృద్ధికి కృషి చేస్తా: ఎంపీ
ABN, First Publish Date - 2022-08-20T05:01:09+05:30
చేగుంట మండలకేంద్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందామని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు.
చేగుంట, ఆగస్టు 19: చేగుంట మండలకేంద్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందామని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. చేగుంట మండల కేంద్రంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శుక్రవారం రూ.10 లక్షలతో నిర్మించే షెడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. చేగుంట అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ను కలిసి నిధులు అందించాలని విజ్ఞప్తి చేసినట్టు పేర్కొన్నారు. రూ 10 లక్షల ప్రొసీడింగ్ కాపీని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తోడుపునూరి నాగరాజుకు ఎంపీ అందజేశారు.
Updated Date - 2022-08-20T05:01:09+05:30 IST