ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజల అభ్యున్నతి కోసమే సంక్షేమ పథకాలు: రసమయి

ABN, First Publish Date - 2022-10-01T04:40:15+05:30

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రజల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అన్నారు.

గాగిల్లాపూర్‌ లో కల్యాణలక్ష్మి చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెజ్జంకి, సెప్టెంబరు 30: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రజల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని తోటపల్లి, గాగిల్లాపూర్‌, బెజ్జంకి క్రాసింగ్‌, దాచారం, ముత్తన్నపేట, బెజ్జంకి, పోతారం గ్రామాల్లో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ పర్యటించారు. స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శమన్నారు.  కార్యక్రమంలో జడ్పీటీసీ కవిత, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాజయ్య, వైస్‌ చైర్మన్‌ లక్ష్మారెడ్డి, కోఆప్షన్‌ మెంబర్‌ మహిపాల్‌రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. కాగా మండలంలోని దాచారంలో నెలకొల్పిన దుర్గామాత మండపంలో శుక్రవారం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, జడ్పీటీసీ కవిత, సర్పంచ్‌ శ్రీనివాస్‌తో కలిసి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 


Updated Date - 2022-10-01T04:40:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising