కడవేరుగులో ఎలుగుబంటి సంచారం
ABN, First Publish Date - 2022-05-21T05:08:05+05:30
చేర్యాల మండలం కడవేరుగు గ్రామశివారులో కొన్ని రోజులుగా ఎలుగుబంటి సంచరిస్తుండడంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు.
చేర్యాల, మే 20: చేర్యాల మండలం కడవేరుగు గ్రామశివారులో కొన్ని రోజులుగా ఎలుగుబంటి సంచరిస్తుండడంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. శుక్రవారం ఉదయం కడవేరుగు-కొమురవెల్లి మండలం రాంసాగర్ గ్రామ శివారులో సంచరించడాన్ని చూసిన రైతులు కేకలు వేయడంతో చెట్లపొదల్లో నుంచి తప్పించుకుపోయింది. దీంతో కడవేరుగు, పెద్దరాజుపేట, రాంసాగర్, కొమురవెల్లి గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు ఎలుగుబంటిని పట్టుకుని రక్షణ కల్పించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
Updated Date - 2022-05-21T05:08:05+05:30 IST