ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
ABN, First Publish Date - 2022-05-15T06:03:53+05:30
మండలంలోని కొర్వీపల్లి గ్రామానికి చెందిన యువకుడు మనస్తాపానికి గురై ఇంట్లో ఉరేసుకుని ఆత్యహత్యకు పాల్పడిన సంఘటన శనివారం చోటు చేసుకుంది.
చిన్నశంకరంపేట, మే 14: మండలంలోని కొర్వీపల్లి గ్రామానికి చెందిన యువకుడు మనస్తాపానికి గురై ఇంట్లో ఉరేసుకుని ఆత్యహత్యకు పాల్పడిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు గ్రామానికి చెందిన లస్మగల్ల ఎల్లం (25) రెండు రోజుల క్రితం కుటుంబీకులతో కలిసీ ఊరెళ్లారు. శనివారం గ్రామానికి చేరుకున్న ఎల్లం అప్పులబాదతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుని ఆత్యహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య రేణుక, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుభా్షగౌడ్ తెలిపారు.
Updated Date - 2022-05-15T06:03:53+05:30 IST