ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్రం మతోన్మాదశక్తులను ప్రేరేపిస్తోంది

ABN, First Publish Date - 2022-07-19T05:18:51+05:30

కేంద్రం ప్రభుత్వం మతోన్మాదశక్తులను ప్రేరేపిస్తూ ప్రజల మధ్య వైషమ్యాలను సృష్టిస్తున్నారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు.

సంగారెడ్డిలోని టీఎన్‌జీవోస్‌ భవన్‌లో సీపీఐ జిల్లా మూడో మహాసభలో మాట్లాడుతున్న సాంబశివరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీఆర్‌ఎ్‌సది అప్రజాస్వామిక పాలన

సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

సంగారెడ్డి రూరల్‌, జూలై 18: కేంద్రం ప్రభుత్వం మతోన్మాదశక్తులను ప్రేరేపిస్తూ ప్రజల మధ్య వైషమ్యాలను సృష్టిస్తున్నారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. సంగారెడ్డిలోని టీఎన్‌జీవోస్‌ భవన్‌లో సోమవారం నిర్వహించిన సీపీఐ జిల్లా మూడో మహాసభకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. పేద, మధ్య తరగతి ప్రజలను ఆదుకోవాల్సిన కేంద్రప్రభుత్వమే పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌, నిత్యావసర వస్తువుల ధరలు పప్పు, నూనెల ధరలను అమాంతంగా పెంచుతూ, ధనికుల వాడే వజ్రాలపై జీఎస్టీని తగ్గించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నారని, అగ్నిపథ్‌ పేరిట దేశ రక్షణకు తూట్లు పొడిచారని విమర్శించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తున్నదని ఎద్దేవా చేశారు. పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ఇవ్వాలని, నిరుద్యోగ యువతకు ఉపాధి చూపాలని ఆయన డిమాండ్‌ చేశారు. రైతులకు రుణమాఫీ చేయాలన్నారు. మహాసభలో ప్రకా్‌షరావు, మంద పవన్‌, యూసుఫ్‌, జిల్లా కార్యదర్శి జలాలొద్దిన్‌, రహ్మన్‌, తాజొద్దిన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-07-19T05:18:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising