కుటుంబ కలహాలతో ఒకరి ఆత్మహత్య
ABN, First Publish Date - 2022-01-29T05:21:46+05:30
కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఊరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తూప్రాన్, జనవరి 28: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఊరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన తూప్రాన్ పట్టణ పరిధిలో శుక్రవారం జరిగింది. గ్రామస్థులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం... తూప్రాన్ పట్టణ పరిధిలోని హైదర్గూడకు చెందిన చంది చిన్న బాలయ్య(50) మూడు రోజులుగా కుటుంబీకులతో తరచూ గొడవ పడుతున్నాడు. గురువారం రాత్రి భార్య, పిల్లలను సైతం బాలయ్య కొట్టినట్లు తెలిసింది. శుక్రవారం ఉదయం పొలం వద్దకు వెళ్లిన బాలయ్య అక్కడే పడిపోవడంతో సోదరుడి కుమారుడు ఇంటికి తీసుకొచ్చాడు. అనంతరం బాలయ్య ఇంటి నుంచి వెళ్లిపోయి బీడీకాలనీ సమీపంలోగల ఓ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తూప్రాన్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Updated Date - 2022-01-29T05:21:46+05:30 IST