మట్టి రవాణాను అదుపు చేయాలి: కాంగ్రెస్
ABN, First Publish Date - 2022-05-25T05:10:56+05:30
మండలంలోని రెడ్డిఖానాపూర్ గ్రామ శివారులోని మామిడి చెరువు నుంచి కొనసాగుతున్న మట్టి వ్యాపారాన్ని వెంటనే ఆపకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయులుగౌడ్ అన్నారు.
హత్నూర, మే 24: మండలంలోని రెడ్డిఖానాపూర్ గ్రామ శివారులోని మామిడి చెరువు నుంచి కొనసాగుతున్న మట్టి వ్యాపారాన్ని వెంటనే ఆపకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయులుగౌడ్ అన్నారు. మంగళవారం దౌల్తాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికార పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు అక్రమ సంపాదనకు అలవాటు పడి ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. సర్పంచ్ భర్త అండదండలతో ఓ వ్యాపారి మట్టిని రవాణా చేస్తున్నాడని పేర్కొన్నారు. ఇదేమని అడిగిన రైతులపై కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని ధ్వజమెత్తారు.
Updated Date - 2022-05-25T05:10:56+05:30 IST