ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధిక సాంద్రత పత్తి సాగును పరిశీలించిన శాస్త్రవేత్తలు

ABN, First Publish Date - 2022-11-18T23:59:49+05:30

అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేయడం వలన దిగుబడులు గణనీయంగా పెరుగుతున్నాయని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం తెలియజేశారు.

ఎడవల్లిలో పత్తి పంటను పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగదేవ్‌పూర్‌, నవంబరు 18: అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేయడం వలన దిగుబడులు గణనీయంగా పెరుగుతున్నాయని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం తెలియజేశారు. మర్కుక్‌, నరసన్నపేట, ఎర్రవల్లిలో ఈ పద్ధతి ద్వారా సాగు చేసే పొలాలను సందర్శించి పరిశీలించారు. పత్తి శాస్త్రవేత్త డా.తిరుమలరావు మాట్లాడుతూ ఈ పద్ధతిలోని వంగడాలు పంట కాలం తక్కువగా ఉండటం వల్ల తొందరగా పూత, కాయలు 20 నుంచి 30 వరకు వస్తున్నాయని వివరించారు. మొక్కలు ఏపుగా పెరగకుండా మేపిక్వాట్‌ క్లోరైడ్‌ అనే మందును పిచికారీ చేసుకోవాలని సూచించారు. ఎకరాకు 25-30 కేజీల యూరియా 15 కిలోల పొటాష్‌ ఎరువులను వేసుకోవాలన్నారు. వారి వెంట డా.రాంప్రసాద్‌, ప్రశాంత్‌, మండల వ్యవసాయ అధికారి టి.నాగేందర్‌ రెడ్డి, రైతు గణేష్‌ తదితరులున్నారు.

Updated Date - 2022-11-18T23:59:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising