ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తులపై కేసు నమోదు

ABN, First Publish Date - 2022-07-02T05:05:20+05:30

విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగదేవ్‌పూర్‌, జూలై 1: విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ కృష్ణమూర్తి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ధర్మారం చెరువులో చేపలు పట్టడానికి గ్రామస్థులు వెళ్లగా.. వారిని అడ్డుకోవడానికి మర్కుక్‌ మండలం వరదరాజ్‌పూర్‌ గ్రామానికి చెందిన అంతని చంద్రం, పిట్టల ఆంజనేయులుతో పాటు మరికొంతమంది గ్రామస్థులు అక్కడికి వెళ్లారు. కాగా ధర్మారం గ్రామస్థులు ఎస్‌ఐ కృష్ణమూర్తికి సమాచారం అందించారు. ఎస్‌ఐ ఆదేశానుసారం ఏఎ్‌సఐ వెంకటరమణారెడ్డి, కానిస్టేబుళ్లు ధర్మారం గ్రామానికి వెళ్లి వరదరాజ్‌పూర్‌ గ్రామస్థులకు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని, గొడవ చేయొద్దని నచ్చజెప్పినా వినకుండా గొడవచేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కృష్ణమూర్తి తెలిపారు.

Updated Date - 2022-07-02T05:05:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising