ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

19న ‘చలో ఢిల్లీ.. మాదిగల లొల్లి’

ABN, First Publish Date - 2022-12-13T00:11:37+05:30

స్సీ వర్గీకరణ సాధనకు ఈనెల 19వ తేదీన చలో ఢిల్లీ.. మాదిగల లొల్లి కార్యక్రమాన్ని తలపెట్టినట్లు ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. సోమవారం ఆయన సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావును కలిశారు. చలో ఢిల్లీ కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు.

మంత్రి హరీశ్‌రావుకు ఆహ్వానపత్రం అందజేస్తున్న వంగపల్లి శ్రీనివాస్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రి హరీశ్‌ను ఆహ్వానించిన వంగపల్లి

సిద్దిపేట అర్బన్‌, డిసెంబరు12 : ఎస్సీ వర్గీకరణ సాధనకు ఈనెల 19వ తేదీన చలో ఢిల్లీ.. మాదిగల లొల్లి కార్యక్రమాన్ని తలపెట్టినట్లు ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. సోమవారం ఆయన సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావును కలిశారు. చలో ఢిల్లీ కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు. అనంతరం వంగపల్లి విలేకరులతో మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్దత కల్పిస్తామని చెప్పి విస్మరించిందని విమర్శించారు. 9 ఏళ్లు గడుస్తున్నా మోక్షం లేదన్నారు. మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు. ఈనెల 19న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Updated Date - 2022-12-13T00:11:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising