ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-07-04T05:20:24+05:30

అప్పులబాధ తాళలేక ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చేర్యాల, జూలై 3: అప్పులబాధ తాళలేక ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం చేర్యాల మండలం కడవేరుగు గ్రామానికి చెందిన సూరెడ్డి జనార్ధన్‌రెడ్డి(61) వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాడు. కాగా ఇరువురు కూతుళ్ల వివాహంతో పాటు ఇంటి నిర్మాణం, పంటల కోసం అప్పులు చేశాడు. కొంతమేర తీర్చినా ఇంకా రూ.5 లక్షలు చెల్లించాల్సి ఉండడంతో ఇబ్బందులు పడుతున్నాడు. ఆదివారం ఉదయం వ్యవసాయ బావి వద్దకెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కాసేపటికి ఇంటికి తిరిగిరాగా, నోటిలోంచి నురగలు రావడాన్ని గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం చేర్యాల ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. ప్రాథమిక చికిత్స చేపట్టినా, అప్పటికే ఆరోగ్యపరిస్థితి క్షీణించడంతో మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2022-07-04T05:20:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising