మానవ అక్రమ రవాణాను అరికట్టాలి
ABN, First Publish Date - 2022-05-24T04:58:53+05:30
మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ పని చేస్తుందని సంస్థ కోఆర్డినేటర్ నరేష్ అన్నారు.
పెద్దశంకరంపేట, మే 23: మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ పని చేస్తుందని సంస్థ కోఆర్డినేటర్ నరేష్ అన్నారు. సోమవారం పెద్దశంకరంపేట మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్ అధ్యక్షతన మానవ అక్రమ రవాణా అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సునీతా క్రిష్ణన్ ఆధ్వర్యంలో 25 సంవత్సరాలుగా 25,500 మంది పసిపిల్లలను, అమ్మాయిలను మహిళలను చీకటి గృహాల నుంచి విడిపించామని వివరించారు. సమాజంలో ప్రజలపై జరుగుతున్న అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ పని చేస్తుందన్నారు. తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల్లోని అంగన్వాడీ టీచర్లకు చట్టాలపైన శిక్షణ ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రియాజుద్దిన్, కోఆర్డినేటర్ రేష్మా, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-05-24T04:58:53+05:30 IST