ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేపల వలలో చిక్కిన భారీ కొండ చిలువలు

ABN, First Publish Date - 2022-04-06T05:08:54+05:30

చేపల కోసం వేసిన వలలో రెండు భారీ కొండచిలువలు చిక్కుకోవడంతో మత్స్యకారుడు భయాందోళనకు గురయ్యాడు.

కొండచిలువలను చూపుతున్న సాయిలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అల్లాదుర్గం, ఏప్రిల్‌ 5:  చేపల కోసం వేసిన వలలో రెండు భారీ కొండచిలువలు చిక్కుకోవడంతో మత్స్యకారుడు భయాందోళనకు గురయ్యాడు. ఈ ఘటన మెదక్‌ జిల్లా అల్లాదుర్గం మండలం అప్పాజీపల్లి గ్రామ శివారులోని గిడ్డమ్మ చెరువులో మంగళవారం జరిగింది. అల్లాదుర్గం పట్టణానికి చెందిన గోండ్ల సాయిలు అనే మత్స్య కార్మికుడు మండలంలోని అప్పాజీపల్లి గ్రామ శివారులోని గిడ్డమ్మ చెరువులో చేపలను  పట్టేందుకు వల వేశాడు. వలను బయటకు తీసే క్రమంలో ఎన్నడూ లేనంత బరువుగా రావడంతో చేపలు ఎక్కువగా పడిఉంటాయని భావించాడు. ఉత్కంఠగా వలను బయటకు లాగిన సాయిలుకు ఊహించని షాక్‌ తగిలింది.  వలలో  పది అడుగుల పొడవైన రెండు భారీ కొండచిలువలు చిక్కుకోవడంతో అవాక్కయ్యాడు. ఇక చేసేదేమీ లేక సమీపంలోని అటవీ ప్రాంతంలో ఆ రెండు కొండచిలువలను వదిలేసి ఇంటిదారి పట్టాడు.

Updated Date - 2022-04-06T05:08:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising