ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిధులు మంజూరైనా రోడ్డు మరమ్మతులు చేపట్టరా?

ABN, First Publish Date - 2022-06-27T05:23:09+05:30

రోడ్డు మరమ్మతులకు నిధులు మంజూరై నాలుగు నెలలు గడుస్తున్నా రోడ్డు పనులకు మోక్షం కలగడం లేదు.

పూర్తిగా ధ్వంసమైన జంగరాయి రోడ్డు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిన్నశంకరంపేట, జూన్‌ 26: రోడ్డు మరమ్మతులకు నిధులు మంజూరై నాలుగు నెలలు గడుస్తున్నా రోడ్డు  పనులకు మోక్షం కలగడం లేదు. మండల కేంద్రం నుంచి జంగరాయి గ్రామానికి వెళ్లే బీటీ రోడ్డు నాలుగు కిలోమీటర్ల వరకు ఉంటుంది. 11 ఏళ్ల క్రితం వేసిన రోడ్డు పూర్తిగా శిథిలావస్థకు చేరుకొని ధ్వంసమైంది. దీంతో రోడ్డు పొడుగునా ఏర్పడిన గుంతల్లో పడి పలువురు వాహనదారులకు గాయాలయ్యాయి. కాగా నాలుగు నెలల క్రితం రోడ్డు మరమ్మతులు చేపట్టేందుకు రూ.95 లక్షలు నిధులు మంజూరైనప్పటికీ పనులు ప్రారంభించడం లేదు. వర్షాకాలం కావడంతో గుంతల్లో నీరు నిలిచి వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. ఇకనైనా ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి రోడ్డు మరమ్మతులను చేపట్టేందుకు కృషి చేయాలని జంగరాయి, చందాపూర్‌, మల్లుపల్లి గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు. 




Updated Date - 2022-06-27T05:23:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising