ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేద విద్యార్థులకు వరం గురుకుల విద్యాలయాలు

ABN, First Publish Date - 2022-09-12T04:29:54+05:30

గ్రామీణప్రాంతంలోని నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకుల విద్యాలయాలు వరంలా మారాయని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి


కంగ్టి, సెప్టెంబరు 11: గ్రామీణప్రాంతంలోని నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకుల విద్యాలయాలు వరంలా మారాయని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రమైన కంగ్టిలోని ఎస్టీ బాలుర గురుకుల విద్యాలయంలో ఆదివారం నిర్వహించిన స్వచ్ఛ గురుకులం ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నాణ్యమైన విద్యను అందిస్తున్న గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు వివిధ పోటీ పరీక్షల్లో ప్రైవేటుకు ధీటుగా ర్యాంకులు సాధిస్తున్నారన్నారు. వివిధ అంశాలపై ఆర్ట్స్‌ టీచర్‌ దేవేందర్‌ నేతృత్వంలో విద్యార్థులు వేసిన చిత్ర కళలను ఎమ్మెల్యే తిలకించి అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ శ్రీనివా్‌సరామ్‌, ఎంపీపీ సంగీతవెంకట్‌రెడ్డి, జడ్పీటీసీ లలితఆంజనేయులు, సర్పంచ్‌ నర్సమ్మ, నాయకులు గంగారాం, గోవింద్‌రెడ్డి పాల్గొన్నారు. మండలంలోని కంగ్టి, బీంరా, నాగూర్‌.కె, నాగూర్‌.బి, తుర్కవడగాం, రాంతీర్థ్‌ గ్రామాల్లో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి ఆసరా పెన్షన్‌లను ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు గంగారాం, సర్పంచ్‌ నర్సమ్మ, గోదావరి బస్వరాజ్‌, నీలమ్మ, రాజుపాటిల్‌, శర్ణప్ప, తదితరులు పాల్గొన్నారు. 


 

Updated Date - 2022-09-12T04:29:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising