ప్రభుత్వ పథకాలు పాడి రైతులకు వరాలు
ABN, First Publish Date - 2022-03-17T04:28:00+05:30
రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ నాణ్యమైన పాల ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా ముందకు సాగుతున్నట్లు మెదక్ విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ పేర్కొన్నారు.
మెదక్ అర్బన్, మార్చి 16: రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ నాణ్యమైన పాల ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా ముందకు సాగుతున్నట్లు మెదక్ విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రభు త్వం పాడి రైతుల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై జిల్లాలోని రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశువైద్యాధికారి విజయశేఖర్ రెడ్డి, పశుగణాభివృద్ధి జిల్లా కార్యనిర్వాహక అధికారి రాంజీ, ఏపీవో రాజ్కుమార్, పాల ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్ దుర్గయ్య, అధికారులు పాల్గొన్నారు.
Updated Date - 2022-03-17T04:28:00+05:30 IST