ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అటవీ భూమి అన్యాక్రాంతం

ABN, First Publish Date - 2022-07-05T05:21:10+05:30

అటవీ భూమి అన్యాక్రాంతమవుతున్నది. రక్షించాల్సిన అధికారులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు. మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండల పరిధిలోని కంపార్ట్‌మెంట్‌ 20లోని 159 సర్వే నంబర్‌లో 440 ఎకరాల అటవీ భూమి ఉన్నది. భూజరంపేట్‌, పీర్యాతండా, కుకుట్లపల్లి, మనంతాయిపల్లి తండాల పరిధిలో ఈ భూమి విస్తరించి ఉన్నది.

అక్రమణకు గురైన అటవీ భూమిని చూపిస్తున్న పీర్యా తండావాసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం  

అందోళనకు సిద్ధమవుతున్న గిరిజనులు

కౌడిపల్లి, జూలై 4: అటవీ భూమి అన్యాక్రాంతమవుతున్నది. రక్షించాల్సిన అధికారులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు. మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండల పరిధిలోని కంపార్ట్‌మెంట్‌ 20లోని 159 సర్వే నంబర్‌లో 440 ఎకరాల అటవీ భూమి ఉన్నది. భూజరంపేట్‌, పీర్యాతండా, కుకుట్లపల్లి, మనంతాయిపల్లి తండాల పరిధిలో ఈ భూమి విస్తరించి ఉన్నది. కూకుట్లపల్లి గ్రామానికి చెందిన కొందరు పీర్యాతండా సమీపంలో అటవీ భూమిని ఆక్రమించుకున్నారు. భూమిని చదును చేసి పంటలు సాగు చేసుకుంటున్నారు. తండా సమీపంలోని అటవీ భూమిలోని గోర్రెపోనికుంట, జలకుంట, వీరబోయిన చెలక, పలుగుగుట్ట, బాపనిదాని కుంట, వైకుంఠధామం సమీపంలో అటవీ భూమి 70 ఎకరాల్లో చెట్లను నరికి చదును చేశారు. ఈ విషయంపై పీర్యాతాండాకు చెందిన గిరిజనులు పలుమార్లు అధికారులకు విన్నవించారు. అటవీ భూమి కబ్జాపై మెదక్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టుకు కూడా ఫిర్యాదు చేసినట్టు వారు తెలిపారు. అయినా కనీసం పరిశీలించేందుకు కూడా రాలేదని భుజరంపేట్‌ మాజీ సర్పంచ్‌ లక్ష్మణ్‌, పీర్యాతండాకు చెందిన నునావత్‌ శంకర్‌, చిన్న శంకర్‌, రాంచందర్‌; దేన్య, అజ్మీర రూప్‌సింగ్‌, శివరాం, శ్రీను, సుభాష్‌, గణేష్‌, సురేష్‌ ఆరోపించారు. అటవీశాఖ అధికారులు కుకుట్లపల్లి గ్రామస్థులకు వంతపాడుతున్నారని వారు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా స్థానిక అధికారులు తప్పుడు సమాచారం అందించి తప్పుదోవ పట్టిస్తున్నారని వాపోయారు. అటవీశాఖ అధికారులు స్పందించి అటవీ భూమిని కాపాడకపోతే ఆందోళనలు చేస్తామని వారు హెచ్చరించారు. ఈ విషయంపై డిప్యూటీ అర్‌ఎ్‌ఫవో రాజమణిని ఆంధ్రజ్యోతి వివరణ కోరగా.. సదరు భూమి తమ పరిధిలోకి రాదని స్పష్టం చేశారు. అటవీ భూములను అక్రమిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, తమ పరిధిలోనిది కాకపోవడంతోనే సదరు భూమిపై స్పందించడం లేదని తెలిపారు. 

Updated Date - 2022-07-05T05:21:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising