ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలి’

ABN, First Publish Date - 2022-01-29T04:29:20+05:30

రైతులు ఆరుతడి పంటల సాగుపైనే దృష్టి సారించి అధిక లాభాలు పొందాలని మెదక్‌ జిల్లా వ్యవసాయాధికారి పరశురాంనాయక్‌ రైతులకు సూచించారు. శుక్రవారం అల్లాదుర్గం మండలంలోని ముస్లాపూర్‌లోని పలువురు రైతులకు సంబంధించిన పంటలను పరిశీలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అల్లాదుర్గం, జనవరి28: రైతులు ఆరుతడి పంటల సాగుపైనే దృష్టి సారించి అధిక లాభాలు పొందాలని మెదక్‌ జిల్లా వ్యవసాయాధికారి పరశురాంనాయక్‌ రైతులకు సూచించారు. శుక్రవారం అల్లాదుర్గం మండలంలోని ముస్లాపూర్‌లోని పలువురు రైతులకు సంబంధించిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయశాఖ ఏఈవోలు పం టల సాగు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసిన సందర్భంగా వాటి వివరాలను సర్వేనంబర్ల ఆధారంగా పున:పరిశీలించారు. పంటల మార్పుతో భూమిలో సారవంతం పెరిగి అధిక దిగుబడి సాధించవచ్చునని రైతులకు సూచించారు. అధిక దిగుబడికి ఇష్టానుసారం గా క్రిమిసంహారకమందులు వాడొద్దని వ్యవసాయశాఖ అధికారుల సలహాలు, సూచనలతో పంటలను సాగు చేయాలన్నారు. ఆయన వెంట స్థానిక ఏవో రాజేష్‌, ఏఈఓ మహేష్‌, అమృత్‌, నవీన్‌, విఠల్‌రావు ఉన్నారు. 

Updated Date - 2022-01-29T04:29:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising