వైద్యులు దేవుడితో సమానం: పద్మారెడ్డి
ABN, First Publish Date - 2022-07-02T05:05:45+05:30
రోగులకు ప్రాణం పోసే వైద్యులు దేవుడితో సమానమని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి కొనియాడారు.
డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులకు సన్మానం
మెదక్ అర్బన్, జూలై 1: రోగులకు ప్రాణం పోసే వైద్యులు దేవుడితో సమానమని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి కొనియాడారు. శుక్రవారం డాక్టర్స్ డే సందర్భంగా శుక్రవారం స్థానిక మాతా శిశు సంరక్షణ కేంద్రంలో వైద్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, డీఎంహెచ్వో వెంకటేశ్వర్రావు, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, వైద్యులు శివదయాల్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
పలు పట్టణాల్లో
సంగారెడ్డి అర్బన్/రేగోడు/పటాన్చెరు/నర్సాపూర్/మనూరు/కంగ్టి/వట్పల్లి: సంగారెడ్డి జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో సీనియర్ వైద్యుడు విఠల్ను ఇన్చార్జి డీఎంహెచ్వో గాయత్రీదేవి సన్మానించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు ఇబ్రహీం, మహేందర్రెడ్డి, బాస్కర్, ఏవో విజయశాంతి, సీనియర్ అసిస్టెంట్ రవి పాల్గొన్నారు. రేణుక ఎల్లమ్మ బోనాల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గౌడ డాక్టర్లను సన్మానించారు. రేగోడు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు శ్వేత, సబితను లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సన్మానించారు. పటాన్చెరు వంద పడకల ఏరియా ఆసుపత్రి వైద్యులను ఎండీఆర్ ఫౌండేషన్ చైర్మన్ దేవేందర్రాజు సన్మానించారు. నర్సాపూర్ లయన్స్క్లబ్ క్లబ్ అధ్యక్షుడు బుచ్చే్సయాదవ్ ఆధ్వర్యంలో డాక్టర్లను సన్మానించారు. మనూరు మండలం తుమ్నూర్లో వైద్యాధికారి సంఘవిని సన్మానించారు. కంగ్టి మండలం తడ్కల్లో సర్పంచు మనోహర్ వైద్యులను సన్మానించారు. వట్పల్లిలో వైద్యులను లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సన్మానించారు.
Updated Date - 2022-07-02T05:05:45+05:30 IST