ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘దళితబంధు’ దేశానికి ఆదర్శం

ABN, First Publish Date - 2022-03-06T05:13:44+05:30

సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న దళితబంధు పథకం దేశానికే ఆదర్శమంటూ అందోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50














అల్లాదుర్గం, మార్చి 5: సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న దళితబంధు పథకం దేశానికే ఆదర్శమంటూ అందోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ అన్నారు. శనివారం అల్లాదుర్గం మండలంలోని ముస్లాపూర్‌ ఓ ఫంక్షన్‌హాల్‌లో దళిత బంధు, మన ఊరు-మన బడిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దళితుల ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో దళితబంధు పథకాన్ని అమలు చేసి, ఒక్కో యూనిట్‌కు రూ.10 లక్షలు అందిస్తున్నారన్నారు. పథకాన్ని సద్వినియోగం చేసుకొని అభివృద్ధి పొందాలని కోరారు. మనఊరు-మనబడితో పాఠశాల రూపురేఖలు మారనున్నాయని తెలిపారు. ప్రభుత్వంతో పాటు ప్రజలు భాగస్వాములుగా ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌, మాజీ ఎంపీపీ కాశీనాథ్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు నర్సింహులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-06T05:13:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising