జహీరాబాద్లో కార్డన్సర్చ్
ABN, First Publish Date - 2022-05-24T04:58:24+05:30
శాంతిభద్రతల దృశ్య ఆధ్వర్యంలో జహీరాబాద్లోని భరత్నగర్ కాలనీలో కార్డన్ సర్చ్ నిర్వహించామని జహీరాబాద్ డీఎస్పీ రఘు అన్నారు.
జహీరాబాద్, మే 23: శాంతిభద్రతల దృశ్య ఆధ్వర్యంలో జహీరాబాద్లోని భరత్నగర్ కాలనీలో కార్డన్ సర్చ్ నిర్వహించామని జహీరాబాద్ డీఎస్పీ రఘు అన్నారు. భరత్నగర్లో నివసిస్తున్న వివిధ ప్రాంతాలకు చెందిన వారి కుటుంబసభ్యులను సోమవారం 70 మంది పోలీసు సిబ్బందితో కలిసి వివరాలను సేకరించారు. అలాగే వివిధ వాహనాలను, ద్విచక్ర వాహనాలను పరిశీలించారు. అలాగే ఎలాంటి పత్రాలు లేని 11 ద్విచక్ర వాహనాలను ఒక అటోను పోలీసులు సీజ్ చేశారు. అలాగే రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ఆయన వెంట జహీరాబాద్ పట్టణ సీఐ తోట భూపతి, ఎస్ఐలు శ్రీకాంత్, పరమేశ్, కాశీనాథ్ ఉన్నారు.
Updated Date - 2022-05-24T04:58:24+05:30 IST