దుర్గామాత పూజలో బీజేపీ నాయకులు
ABN, First Publish Date - 2022-10-05T04:51:54+05:30
సంగారెడ్డి సమీపంలోని చింతల్పల్లిలో దేవీనవరాత్రోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహానికి మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు రాజేశ్వర్రావు దేశ్పాండే, ప్రముఖ వైద్యుడు డాక్టర్ రాజుగౌడ్ ప్రత్యేక పూజలు చేశారు.
సంగారెడ్డి అర్బన్/ సంగారెడ్డి రూరల్, అక్టోబరు 4: సంగారెడ్డి సమీపంలోని చింతల్పల్లిలో దేవీనవరాత్రోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహానికి మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు రాజేశ్వర్రావు దేశ్పాండే, ప్రముఖ వైద్యుడు డాక్టర్ రాజుగౌడ్ ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు హోమంతో పాటు అన్నదాన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ్పాండే, డాక్టర్ రాజుగౌడ్లను నిర్వాహకులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నిర్వాహకులు లింగం, సతీశ్, అర్వింద్ తదితరులు ఉన్నారు.
Updated Date - 2022-10-05T04:51:54+05:30 IST