ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాదాసీదాగా మండల సర్వసభ్య సమావేశం

ABN, First Publish Date - 2022-08-20T05:04:46+05:30

చిన్నశంకరంపేట మండల సర్వసభ్య సమావేశం శుక్రవారం సాదాసీదాగా కొనసాగింది. ఎంపీపీ భాగ్యలక్ష్మి అధ్యక్షతన ఎంపీడీవో గణే్‌షరెడ్డి సమావేశాన్ని నిర్వహించారు.

మాట్లాడుతున్న ఎంపీపీ భాగ్యలక్ష్మి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 గైర్హాజరైన అధికారులు

 ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీపీ భాగ్యలక్ష్మి 

చిన్నశంకరంపేట, ఆగస్టు 19: చిన్నశంకరంపేట మండల సర్వసభ్య సమావేశం శుక్రవారం సాదాసీదాగా కొనసాగింది. ఎంపీపీ భాగ్యలక్ష్మి అధ్యక్షతన ఎంపీడీవో గణే్‌షరెడ్డి సమావేశాన్ని నిర్వహించారు. సర్వసభ్య సమావేశానికి పలువురు అధికారులు గైర్హాజరు కావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు సమయ పాలన పాటించకుంటే చర్యలు తీసుకోవల్సి వస్తుందని హెచ్చరించారు. అభివృద్ధి సమస్యలు తెలుపాల్సిన వారు సమావేశానికి ఎందుకు హజరు కాలేదో వివరణ ఇవ్వాలన్నారు. అనంతరం పలు సమస్యలపై ఎంపీటీసీలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో వరదల ఉధృతితో పంటలు దెబ్బతిన్నాయని నేటికి నష్టపోయిన రైతుల వివరాలు సేకరించలేదని ఏవో ప్రవీణ్‌పై చందంపేట ఎంపీటీసీ శివకుమార్‌ మండిపడ్డారు. రైతుల సమస్యలు పట్టించుకోని అధికారులు ఎందుకని ప్రశ్నించారు. విద్యుత్‌ కోతలతో పంటలు వాడిపోతున్నాయని విద్యుత్‌ అధికారులను పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు నిలదీశారు. అధికారులు, పలువురు సర్పంచులు సర్వసభ్య సమావేశానికి హజరు కాకపోవడంతో సమావేశం వెలవెలబోయింది. సమావేశంలో తహసీల్దార్‌ రాజేశ్వర్‌రావు, వైస్‌ ఎంపీపీ సత్యనారాయణగౌడ్‌, డాక్టర్‌ శ్రావణి, ఎంపీటీసీలు శివకుమార్‌, అనురాధ, సునీత, రాణమ్మ, ప్రసాద్‌గౌడ్‌, కోఆప్షన్‌ సభ్యుడు ఫరీద్‌, సక్కుబాయి, సర్పంచులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-20T05:04:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising