రియల్ ఎస్టేట్ సంస్థల్లో భారీగా నగదు పట్టివేత
ABN, First Publish Date - 2022-01-11T00:37:19+05:30
నగరంలోని పలు రియల్ ఎస్టేట్ సంస్థల్లో భారీగా నగదును
హైదరాబాద్: నగరంలోని పలు రియల్ ఎస్టేట్ సంస్థల్లో భారీగా నగదును ఐటీ అధికారులు పట్టుకున్నారు. రూ.800 కోట్ల లావాదేవీలు జరిగినట్లుగా గుర్తించారు. మూడు రియల్ ఎస్టేట్ సంస్థల్లో నాలుగు రోజుల పాటు ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. నవ్య డెవలపర్స్, రాఘ మయూరి ఇన్ఫ్రా, స్కంధాన్షీ ఇన్ఫ్రా సంస్థల్లో సోదాలు చేశారు. దాదాపు రూ.1.64 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, అనంతపూర్, కర్నూలు, వైజాగ్లలో సోదాలు చేశారు. రియల్ ఎస్టేట్ సంస్థలు పెద్దమొత్తంలో అనధికారికంగా లావాదేవీలు నిర్వహించినట్టు గుర్తించారు.
ఐటీకి చిక్కకుండా సాఫ్ట్వేర్ను కంపెనీలు ధ్వంసం చేశాయి. భూములు కొనుగోలు చేసి నగదు చెల్లింపుల చేశాయి. అయితే బ్యాంకు ద్వారా చెల్లింపులు చేయకుండా కంపెనీలు తగు జాగ్రత్తలు తీసుకున్నాయి. నగదు లావాదేవీల కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ను కంపెనీలు తయారు చేసుకున్నాయి.
Updated Date - 2022-01-11T00:37:19+05:30 IST