ఆ విషయంలో రాష్ట్రపతిని కలుస్తాం: మందకృష్ణ
ABN, First Publish Date - 2022-04-12T19:39:30+05:30
దేశ ప్రజలకు సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.
హైదరాబాద్: దేశ ప్రజలకు సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో గత రెండు నెలలుగా వివిధ కార్యక్రమాలు నిర్వహించాం.ఏప్రిల్ నెలని రాజ్యాంగ పరిరక్షణ మాసంగా జరుపుకుంటాం.రాజ్యాంగబద్ధ పాలన కాకుండా రాచరిక పాలనను కేసీఆర్ కోరుకుంటున్నారు. రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో త్వరలోనే రాష్ట్రపతిని కలుస్తాం’’ అని మందకృష్ణ మాదిగ. తెలిపారు.
Updated Date - 2022-04-12T19:39:30+05:30 IST