ట్రాక్టర్, బైక్ ఢీ.. ఒకరు మృతి
ABN, First Publish Date - 2022-07-31T05:12:22+05:30
ట్రాక్టర్, ద్విచక్ర వాహ నం ఢీకొని ఒకరు మృతి చెందగా, మరొకరు తీ వ్రంగా గాయపడిన సంఘటన నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి మండల కేంద్ర సమీపంలో చోటు చేసుకుంది.
- మరొకరికి తీవ్ర గాయాలు
తెలకపల్లి, జూలై 30: ట్రాక్టర్, ద్విచక్ర వాహ నం ఢీకొని ఒకరు మృతి చెందగా, మరొకరు తీ వ్రంగా గాయపడిన సంఘటన నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి మండల కేంద్ర సమీపంలో చోటు చేసుకుంది. ఎస్సై వి.ప్రదీ ప్కుమార్ అందించిన వివరాల ప్రకారం.. తెలకపల్లి మండలం దాసుపల్లి గ్రామానికి చెం దిన ట్రాక్టర్ తెలకపల్లి నుంచి దాసుపల్లికి వస్తుండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నియోజకవర్గం గోకవరంకు చెందిన పి.ప్రభాకర్, లాలూప్రసాద్లు ద్వి చక్ర వాహనంపై తెలకపల్లి నుంచి నాగర్కర్నూల్ వెళ్తున్నారు. బైక్ ప్రమాదవశాత్తు దాసు పల్లి గేటు వద్ద ట్రాక్టర్ ట్రాలీకి వెనక భాగానికి ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై ఉన్న పి.ప్రభాకర్ అక్కడికక్కడే మృతి చెందగా, లాలూప్రసాద్కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగా త్రుడిని చికిత్స నిమిత్తం నాగర్కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు.
Updated Date - 2022-07-31T05:12:22+05:30 IST