ప్రధానోపాధ్యాయురాలి సస్పెన్షన్
ABN, First Publish Date - 2022-12-12T22:43:09+05:30
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మునిసిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట ప్రాథమిక పాఠశాలను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు ప్రధానోపాధ్యాయురాలిని సస్పెండ్ చేశారు.
విధులకు ఆలస్యం కావడంతో వేటు వేసిన కలెక్టర్
కావేరమ్మపేట ప్రాథమిక పాఠశాల ఆకస్మిక తనిఖీ
జడ్చర్ల, డిసెంబరు 12 : మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మునిసిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట ప్రాథమిక పాఠశాలను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు ప్రధానోపాధ్యాయురాలిని సస్పెండ్ చేశారు. ఉదయం 8 గంటల 35 నిమిశాలకు పాఠశాలను తనిఖీ చేసేందుకు కలెక్టర్ వచ్చారు. పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులతో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. తరగతి గదిలో విద్యార్థుల విద్యాసామర్థ్యాన్ని తెలుసుకునేందుకు పలు ప్రశ్నలు వేశారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగం గా చేపట్టిన పనులను పరిశీలించి, నిర్మాణానికి సంబంధించిన పలు సూచనలు, సలహాలను సంబంధిత ఇంజనీర్లకు సూచించారు. ఉదయం తొమ్మిది గంటలకు జరిగే ప్రార్థనకు హాజరుకావాల్సి ప్రధానోపాధ్యాయురాలు శ్రీలక్ష్మీ 9 గంటల 45 నిమిశాల వరకు కూడా రాకపోవడంతో సస్పెండ్ చేశారు. అలాగే ప్రార్థనకు ఆలస్యంగా హాజరైన ఉపాధ్యాయురాలు శారదకు మెమో జారీ చేశారు. ఈ మేరకు వారిద్దరికి ఉత్తర్వులు అందచేసినట్లు ఎంఈవో మంజులాదేవి తెలిపారు. కలెక్టర్ ఆకస్మిక తనిఖీతో మండలంలోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు అప్రమత్తం అయ్యారు.
Updated Date - 2022-12-12T22:43:10+05:30 IST