మెరుగైన వైద్య సేవలు అందించాలి
ABN, First Publish Date - 2022-05-18T04:49:03+05:30
ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించాలని వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్కుమార్ పేర్కొన్నారు.
- జిల్లా ఆసుపత్రిని పరిశీలించిన వైద్యవిధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్
నారాయణపేట క్రైం, మే 17 : ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించాలని వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్కుమార్ పేర్కొన్నారు. మంగళవారం నారాయణపేట జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించి ఎమర్జెన్సీ వార్డు, లేబర్ రూంను పరిశీలించి ఆసుపత్రి నిర్వహణకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. జిల్లా ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య ఎక్కువగా ఉండడంతో వైద్య సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఆయా విభాగాలకు చెందిన రికార్డులను, హజరు శాతాన్ని పరిశీలించారు. జిల్లా ఆసుపత్రిలో సిబ్బంది కొరతతో పాటు పరికరాలు లేవని తెలపడంతో వీలైనంత త్వరగా సిబ్బందిని నియమించడంతో పాటు పరికరాలు అందించేందుకు కృషిచేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రంజిత్, మల్లికా ర్జున్, ఛక్రధర్, క్రాంతికిరణ్ పాల్గొన్నారు.
Updated Date - 2022-05-18T04:49:03+05:30 IST