ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను బొంద పెడదాం

ABN, First Publish Date - 2022-08-14T05:18:09+05:30

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను బొందపెడదామని అలంపూర్‌ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ అన్నారు.

అయిజలో ప్రజలకు అభివాదం చేస్తున్న సంపత్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  అయిజ, ఆగస్టు 13: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను బొందపెడదామని అలంపూర్‌ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ అన్నారు. శనివారం అయిజ మండల పరిధిలోని యాపదిన్నె గ్రామం నుంచి స్వాతంత్య్ర గౌరవ్‌ పాదయాత్రను ప్రారంభించారు. అనం తరం అయిజ పట్టణంలోని కొత్త బస్టాండు ముందు ప్రజలను ఉద్దేశించి సంపత్‌ మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికం చేపట్టిన నాటి నుంచి అన్ని రకాల వస్తువులపై ధరలు పెంచారన్నారు.  బంగారు తెలంగాణ పేరుతో ప్రజలను మోసగి స్తూ కుటుంబ పాలనతో కేసీఆర్‌ లబ్ధిపొందుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ పాలనలో తప్ప ఇప్పటి వరకు ప్రజలకు చేసిందిలేదని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక పాలనతో ఇప్పటికే ప్రజలు విసిగిపోయారని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ కు ప్రజలు మద్దతు తెలుపాలని కోరారు.  అలాగే కౌన్సిలర్‌ షేక్షావలిఆచారి,  తిప్పన్న, అడ్వకేట్‌ మధు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ దేవరాజు,  నాయకులు మద్దిలేటి, జయన్న, బార్కి దేవన్న, దేవేంద్ర, లాల్‌గౌడు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-14T05:18:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising