మాదక ద్రవ్యాలను నిర్మూలిద్దాం
ABN, First Publish Date - 2022-06-27T05:15:47+05:30
మా దక ద్రవ్యాలను నిర్మూలిద్దా మని ఎస్సై బాలరాజు అన్నా రు.
ఉండవల్లి, జూన్ 26: మా దక ద్రవ్యాలను నిర్మూలిద్దా మని ఎస్సై బాలరాజు అన్నా రు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవా న్ని పురస్కరించుకొని ఆదివా రం మండల కేంద్రంలో పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో గ్రామస్థులకు అవగాహన క ల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై బాలరాజు మాట్లాడు తూ యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారకుండా తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అనం తరం యువతతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్ర మంలో ఏఎస్సై అయ్యన్న, సిబ్బంది పాల్గొన్నారు.
& కేటీదొడ్డి : గంజాయి, గుట్కాలాంటి మత్తు పదార్థాలను సమాజం నుంచి పారద్రోలడంలో ప్రజలు భాగస్వాములు కావాలని ఎస్సై కుర్మయ్య అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో యువతకు, ప్రజలకు గంజాయి, మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మత్తు పదార్థాలు అమ్మినా, రవాణ చేసినా ఎప్ప టికప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలని వా రి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. అ నంతరం సిబ్బంది, యువత, ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ఆయా గ్రామాల యువకులు, ప్రజలు పాల్గొన్నారు.
Updated Date - 2022-06-27T05:15:47+05:30 IST