కల్యాణలక్ష్మి పేదలకు అండ
ABN, First Publish Date - 2022-08-16T05:37:26+05:30
కల్యాణలక్ష్మి పథకం పేదలకు అండగా మారిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు.
- మంత్రి నిరంజన్రెడ్డి
- పెద్దమునుగాల్చెడ్లో యాదవ కమ్యూనిటీ హాల్ ప్రారంభం
అడ్డాకుల, ఆగస్టు 15: కల్యాణలక్ష్మి పథకం పేదలకు అండగా మారిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం అడ్డాకుల మండలం పెద్దమునుగాల్ చెడ్లో యాదవ కమ్యూనిటీ భవనాన్ని ఆయన ప్రారంభించి, మాట్లాడారు. ఈ సంద ర్భంగా పెద్దమునుగాల్చెడ్, బలీద్పల్లి, చిన్నమునుగాల్చెడ్, కన్మనూరుకు చెందిన పది మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నాగార్జున్రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు రాజశేఖర్రెడ్డి, సర్పంచ్ విజయలక్ష్మీ, తహసీల్దార్ కిషన్, విండో అధ్యక్షుడు జితేందర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Updated Date - 2022-08-16T05:37:26+05:30 IST