ఉమామహేశ్వరంలో అమ్మవారి పల్లకీ సేవ
ABN, First Publish Date - 2022-08-23T05:41:44+05:30
ఉమామహేశ్వర క్షేత్రంలో సోమవారం ఆలయ ఈవో శ్రీనివాస రావు, కమిటీ చైర్మన్ కందూరి సుధాకర్ ఆధ్వర్యంలో అమ్మవారిని అర్చకులు వీరయ్య, రవికుమార్, నీలకంఠం పల్లకీలో ఆలయం నుంచి పాపనాశిని గుండం వరకు భజన కీర్తనలతో ఉరేగింపుగా తీసుకెళ్లారు.
అచ్చంపేట అర్బన్, ఆగస్టు 22: ఉమామహేశ్వర క్షేత్రంలో సోమవారం ఆలయ ఈవో శ్రీనివాస రావు, కమిటీ చైర్మన్ కందూరి సుధాకర్ ఆధ్వర్యంలో అమ్మవారిని అర్చకులు వీరయ్య, రవికుమార్, నీలకంఠం పల్లకీలో ఆలయం నుంచి పాపనాశిని గుండం వరకు భజన కీర్తనలతో ఉరేగింపుగా తీసుకెళ్లారు. పాపనాశిని గుండంలో అమ్మవారి జల్లికట్టు స్నానాలు చేయించి ఆలయం వద్దకు తీసుకెళ్లి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. శ్రావణ మాసం చివరి సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ సిబ్బంది రామకృష్ణ, పర్వతాలు, లక్ష్మయ్య, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-08-23T05:41:44+05:30 IST