విద్యుదాఘాతంతో రైతు మృతి
ABN, First Publish Date - 2022-08-12T04:53:49+05:30
వనపర్తి జిల్లా వీపనగండ్ల మండల పరిధిలోని సంగినేనిపల్లి గ్రామంలో విద్యుదాఘాతంతో రైతు ఆల్లె ఆంజనేయులు (40) మృతి చెందాడు.
వీపనగండ్ల, ఆగస్టు 11 : వనపర్తి జిల్లా వీపనగండ్ల మండల పరిధిలోని సంగినేనిపల్లి గ్రామంలో విద్యుదాఘాతంతో రైతు ఆల్లె ఆంజనేయులు (40) మృతి చెందాడు. గురువారం మధ్యాహ్నం తన వ్యవసాయ పొలంలోని ట్రాన్స్ఫార్మర్ను ఆన్ చే యగా విద్యుదాఘాతంతో రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. చుట్టుపక్కల పొలాల రైతులు ఈ సంఘటనను గమనించి బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ రామన్ గౌడ్ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నామని తెలిపారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
Updated Date - 2022-08-12T04:53:49+05:30 IST