నిరంకుశ పాలనకు చరమగీతం తప్పదు
ABN, First Publish Date - 2022-06-15T04:21:22+05:30
కేంద్ర ప్రభుత్వ బీజేపీ పాలనకు చరమగీతం తప్పదని కాంగ్రెస్ మండల నాయకులు వార్ల విజయ్కుమార్, గోవర్ధన్రెడ్డి, తుడుం శ్రీనివాస్ పేర్కొన్నారు.
కోస్గి, జూన్ 14 : కేంద్ర ప్రభుత్వ బీజేపీ పాలనకు చరమగీతం తప్పదని కాంగ్రెస్ మండల నాయకులు వార్ల విజయ్కుమార్, గోవర్ధన్రెడ్డి, తుడుం శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం కోస్గి పట్టణంలోని శివాజీ చౌరస్తాలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్గాంధీకి ఈడీ నోటీసులు జారీ చేయడంలో కేంద్ర ప్రభుత్వ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ పాలనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వాపోయారు. రాబోయే రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. కాంగ్రెస్ నాయకులు రఘువర్ధన్రెడ్డి, బెజ్జు రాములు, ఇద్రీస్, టెంటు నర్సిములు, వెంకట్రాములు, ఫెరోజ్, హాజీ, అనంతయ్య పాల్గొన్నారు.
Updated Date - 2022-06-15T04:21:22+05:30 IST