ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమస్యలు పరిష్కరించాలని ధర్నా

ABN, First Publish Date - 2022-05-24T04:38:18+05:30

జిల్లా కేంద్రం, పట్టణం, పలు కాలనీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని సీపీఎం నాయకుడు కిల్లెగోపాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

ఆందోళన చేపట్టిన సీపీఎం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


పాలమూరు, మే 23: జిల్లా కేంద్రం, పట్టణం, పలు కాలనీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని సీపీఎం నాయకుడు కిల్లెగోపాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం పట్టణంలో సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. 15రోజుల నుంచి పలు వార్డుల్లో నెలకొన్న సమస్యలను సీపీఎం ప్రతినిధి బృందం పరిశీలించి అధికారుల దృష్టికి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. 28వ వార్డు బండ్లగేరిలో ఓపెన్‌ డ్రైయినేజీతో ప్రజలు రోగాలబారిన పడుతున్నారని, షాషాబ్‌గుట్టలో భగీరథ నీటి సమస్య, మోతీనగర్‌ గుట్టపైన వడ్డెరలకు నివాస స్థలాలు లేవని పేర్కొన్నారు. పలు వార్డుల్లో నెలకొన్న సమస్యలను మునిసిపల్‌ అధికారులకు వివరించినట్లు తెలిపారు. సమస్యలను త్వరగా పరిష్కరించి ప్రజల ఆరోగ్యం కాపాడాలని కోరారు. కార్యక్రమంలో బి.చంద్రకాంత్‌, పద్మ, అనురాధ, గాలయ్య, విష్ణు, జహంగీర్‌, భానుప్రసాద్‌, వెంకటమ్మ, మాణిక్యరావు, శ్రీనివాసులు, లక్ష్మీ, గౌసియాబేగం, నాగమణి, అంజమ్మలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-24T04:38:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising