దుందుభీ నదిలోకి ఆటో
ABN, First Publish Date - 2022-07-28T05:16:57+05:30
నాగర్కర్నూల్ జిల్లా తాడూరు మం డలంలోని సిర్సవాడ గ్రామం వద్ద ఉన్న దుందుభీ నది ప్రవా హం బుధవారం మ ధ్యాహ్నం అకస్మాత్తుగా పెరిగింది.
తాడూరు, జూలై 27: నాగర్కర్నూల్ జిల్లా తాడూరు మం డలంలోని సిర్సవాడ గ్రామం వద్ద ఉన్న దుందుభీ నది ప్రవా హం బుధవారం మ ధ్యాహ్నం అకస్మాత్తుగా పెరిగింది. దీంతో మా దారం నుంచి సిర్సవా డ వైపు వస్తున్న ఆటో ప్రమాదవశాత్తు నీటి ఉధృతికి రోడ్డుపై నుంచి కిందికి పడిపోయింది. అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకు లు చాకచక్యంగా బయటపడి తృటిలో ప్రాణాలను కాపా డుకున్నారు. ప్రమాదానికి గురైన ఈ ఆటో ఊర్కొండ మండలం మాదారం గ్రామానికి చెందినది. ఈ ఆటోలో ప్రయాణిం చిన వారిలో శ్రీశైలం, నిరంజన్ ఉన్నారు. అయితే నది ప్రవహిస్తున్న సమయంలో వాహనాల రాకపోకలకు ఇ బ్బందులు కలుగుతున్న నేపథ్యంలో చాలా ఏళ్లుగా సిర్స వాడ గ్రామ సమీపంలో దుందుభీ నదిపై బ్రిడ్జి నిర్మించా లంటూ సంబంధిత శాఖ అధికారులకు, ప్రజాప్రతినిధు లకు ఎంత మొర పెట్టుకున్నా నేటికీ ఆ కల నెరవేరడం లేదంటూ గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు. నది ప్రవాహం జరుగుతున్న సమయంలో రాకపోకలు నిలిచిపోవడం మూలంగా రైతులు, కూలీలతో పాటు వాహనదారులు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - 2022-07-28T05:16:57+05:30 IST