పెండింగ్ పనులన్నీ నిల్
ABN, First Publish Date - 2022-11-27T22:45:20+05:30
పెండింగ్ పనులన్నీ పూర్తి చేసినట్లు తహ సీల్దార్ దయాక్రెడ్డి పేర్కొన్నారు.
- ఆదివారం విధులు నిర్వహించిన తహసీల్దార్
నర్వ, నవంబరు 27 : పెండింగ్ పనులన్నీ పూర్తి చేసినట్లు తహ సీల్దార్ దయాక్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నర్వ తహసీల్దార్ కార్యా లయంలో అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించారు.ఈ సంద ర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ప్రధానంగా పీవోపీ, జేఎల్ఎం, విరాసత్, పెండింగ్ మ్యూటేషన్, కల్యాణ లక్ష్మి, గ్రీవెన్స్ తదితర భూ సమస్యలు అన్నింటిని జీరో స్థాయికి తీసుకొచ్చామన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష చొరవతోనే పెండింగ్ పనులు 15 రోజుల్లోనే పూర్తి చేసినట్లు తహసీల్దార్ తెలిపారు. డీటీ వాసుదేవరావ్, ఆర్ఐ అమ రేందర్ శెట్టి, శ్రీశైలం విధులు నిర్వహించారు.
Updated Date - 2022-11-27T22:45:22+05:30 IST