ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నడిగడ్డపై నీలిరంగు జెండా ఎగురవేయాలి

ABN, First Publish Date - 2022-11-27T23:28:20+05:30

నడిగడ్డలో సామాన్య ప్రజలకు సమన్యాయంతో పాటు సమస్యలు పరిష్కారం కావాలంటే నీలిరంగు జెండా ఎగురవేయాలని బీఎస్పీ జిల్లా అధ్య క్షుడు కేశవరావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇటిక్యాల, నవంబరు 27: నడిగడ్డలో సామాన్య ప్రజలకు సమన్యాయంతో పాటు సమస్యలు పరిష్కారం కావాలంటే నీలిరంగు జెండా ఎగురవేయాలని బీఎస్పీ జిల్లా అధ్య క్షుడు కేశవరావు అన్నారు. బహుజన సమాజ్‌ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర అయిదవ రోజు ఆదివారం ఇటిక్యాలకు చేరుకొంది. అంబేడ్కర్‌ చౌరస్తాలో మొదట అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం అయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని, పాలకులు మారినా తమ బ్రతుకులు మారలేదని ప్రజలు వాపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, మండల కేంద్రం లో ఇలా ఉంటే గ్రామీణ ప్రాంతాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చ న్నా రు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే బీఎస్పీతోనే సాధ్యమన్నారు. పాదయాత్ర మునుగాల, కోదండాపురం, వేముల గ్రామాల మీదుగా ధర్మవరం గ్రామానికి సాయంత్రం చేరుకొంది. కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు మణికుమార్‌, ప్రధాన కార్యదర్శి ఆకెపోగు రాంబాబు, నా యకులు తిరుపాల్‌, రాములమ్మ, అశ్విని, గ్రామాల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-27T23:28:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising