ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లోక్‌ అదాలత్‌లో 3,564 కేసుల పరిష్కారం

ABN, First Publish Date - 2022-08-14T05:43:24+05:30

లోక్‌అదాలత్‌ ద్వారా జిల్లాలో 3,564 కేసులు పరిష్కారం అయ్యాయి.

సమావేశంలో మాట్లాడుతున్న న్యాయమూర్తి ప్రేమావతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- జిల్లా న్యాయమూర్తి ప్రేమావతి

మహబూబ్‌నగర్‌ లీగల్‌ కంట్రిబ్యూటర్‌, ఆగస్టు 13 : లోక్‌అదాలత్‌ ద్వారా జిల్లాలో 3,564 కేసులు పరిష్కారం అయ్యాయి. జాతీయ న్యాయాధికారసేవా సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ అధికార సేవాసంస్థ ఆధ్వర్యంలో శనివా రం లోక్‌ అదాలత్‌ కార్యక్రమం నిర్వహించారు. ఇందుకోసం మహబూబ్‌ నగర్‌ జిల్లా కోర్టులో ఆరు, జడ్చర్ల కోర్టులో రెండు బెంచ్‌లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తి ప్రేమావతి మాట్లాడుతూ రాజీమార్గం ద్వారా కేసులను పరిష్కరించుకోవడం మంచి మార్గమని, ఈ అవకాశాన్ని జిల్లాలోని కక్షిదారులు చక్కగా వినియోగించుకున్నారని తెలిపారు. రాజీ అయ్యే అన్ని రకాల కేసులను పరిష్కరించామన్నారు. ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా జడ్జి బోయ శ్రీనివాసులు, రెండవ అదనపు జిల్లా ఇన్‌చార్జి న్యాయమూర్తి పద్మ, జిల్లా న్యాయసేవాసంస్థ కార్యదర్శి సంధ్యారాణి, ప్రిన్సిపాల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీదేవి, మొబైల్‌ కోర్టు న్యాయమూర్తి కిరణ్‌,పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-14T05:43:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising