TS News: భార్యను గొడ్డలితో నరికి చంపిన ఉపసర్పంచ్
ABN, First Publish Date - 2022-07-26T16:12:46+05:30
జిల్లాలోని మరిపెడ మండలం అజ్మీరాతండా పంచాయితీ పరిధిలోని ఆనకట్టతండాలో దారుణం చోటు చేసుకుంది.
మహబూబాబాద్: జిల్లాలోని మరిపెడ మండలం అజ్మీరాతండా పంచాయితీ పరిధిలోని ఆనకట్టతండాలో దారుణం చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో ఉపసర్పంచ్ రవీందర్ గొడ్డలితో నరికాడు. తీవ్రంగా గాయపడిన భార్య మమత అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలిసిన మమత బంధువులు ఆగ్రహంతో రవీందర్ ఇంటిపై దాడి చేసి వస్తువులను తగులబెట్టారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళనకారులపై లాఠీచార్జ్ చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మహిళలను మగ పోలీసులు విచక్షణారహితంగా కొట్టారు.
Updated Date - 2022-07-26T16:12:46+05:30 IST