TS News: మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో చోరీ
ABN, First Publish Date - 2022-08-12T17:57:48+05:30
మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో దుండుగలు చోరీకి తెగబడ్డారు.
మహబూబాబాద్: మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో దుండుగలు చోరీకి తెగబడ్డారు. మహబూబాబాద్ స్టేషన్లో గోల్కొండ ట్రైన్ ఎక్కుతుండగా ఓ మహిళ దగ్గర నుండి దొంగలు బ్యాగ్ కొట్టేశారు. బ్యాగ్లో తులం బంగారం, దిద్దులు, సెల్ ఫోన్, నగదు ఉన్నట్లు బాధితురాలు తెలిపింది. ఇల్లెందుకు చెందిన సుమలత తన అన్నకు రాఖీ కట్టడానికి వరంగల్కు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. మహబూబాబాద్ రైల్వే పోలీసులకు బాధితురాలు సుమలత ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2022-08-12T17:57:48+05:30 IST