Mahabubabad: డాక్టర్ అందుబాటులో లేక రోగుల అవస్థలు
ABN, First Publish Date - 2022-04-27T14:09:51+05:30
జిల్లాలోని గంగారం మండలం కోమట్లగూడెం పీహెచ్సీలో డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో రోగులు తీవ్రంగా అవస్థలకు గురవుతున్నారు.
మహబూబాబాద్: జిల్లాలోని గంగారం మండలం కోమట్లగూడెం పీహెచ్సీలో డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో రోగులు తీవ్రంగా అవస్థలకు గురవుతున్నారు. రాత్రి పురిటినొప్పులతో వచ్చిన నిండు గర్భిణికి నర్సు రాజమణి డెలివరీ చేశారు. తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు. డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో నర్సు రాజమణి అన్నీతానై చూస్తున్నారు. డాక్టర్ను అందుబాటులో ఉంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Updated Date - 2022-04-27T14:09:51+05:30 IST