ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Madapur కాల్పుల కేసులో కొత్త కోణం

ABN, First Publish Date - 2022-08-01T15:16:21+05:30

మాదాపూర్ కాల్పుల కేసు(Madapur Firing case)లో కొత్త కోణం వెలుగు చూసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad : మాదాపూర్ కాల్పుల కేసు(Madapur Firing case)లో కొత్త కోణం వెలుగు చూసింది. తాడ్‌బండ్‌లోని 250 గజాల భూమి విషయంలో వివాదం చోటు చేసుకుంది. ఈ భూమిని కొన్నాళ్ల క్రితమే మహ్మద్ పేరుపై రియల్ ఎస్టేట్(Real Estate) వ్యాపారి ఇస్మాయిల్ గిఫ్ట్ డీడ్ చేశాడు. వివాద పరిష్కారం కోసం ఇస్మాయిల్‌ను మహ్మద్(Mohammad) మాదాపూర్‌కు పిలిచాడు. ఇస్మాయిల్, మహ్మద్ మాట్లాడుతుండగా జిలానీ(Jilani) కాల్పులు జరిపాడు. ఇస్మాయిల్‌పై కంట్రిమేడ్ వెపన్‌(Country made weapon)తో 6 రౌండ్ల కాల్పులు జరిపాడు. ఘటనలో ఇస్మాయిల్‌ మృతి చెందగా.. అతనితో పాటు ఉన్న జహంగీర్‌కు గాయాలయ్యాయి. మహ్మద్‌కు జిలానీ రైట్ హ్యాండ్‌గా ఉన్నాడని తెలుస్తోంది. ఈ ఘటనపై జహంగీర్ మాట్లాడుతూ.. ‘‘మహ్మద్-ఇస్మాయిల్ మధ్య భూ వివాదం ఉంది. నిన్న రాత్రి మహ్మద్ కాల్ చేశాడు. మాదాపూర్‌కు నేను, ఇస్మాయిల్, అక్బర్ వెళ్లాం. మహ్మద్, ఇస్మాయిల్ కలిసి చాలా సేపు మాట్లాడుకున్నారు. ఇస్మాయిల్‌పై ఒక్కసారిగా ఫైర్ ఓపెన్ చేశారు. అడ్డుకునేందుకు వెళ్తే నాపై జిలానీ కాల్పులు జరిపాడు’’ అని వెల్లడించాడు.




Updated Date - 2022-08-01T15:16:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising