ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

T.News: దేశ సమగ్రతకు ముప్పు తెచ్చేలా కేంద్రం విధానాలు: Gutta

ABN, First Publish Date - 2022-07-21T15:47:06+05:30

దేశ సమగ్రతకు ముప్పు తెచ్చేలా కేంద్రం విధానాలు ఉన్నాయని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్గొండ: దేశ సమగ్రతకు ముప్పు తెచ్చేలా కేంద్రం విధానాలు ఉన్నాయని శాసన మండలి చైర్మన్(Legislative Council Chairman ) గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutta Sukhender Reddy) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... జాతీయ ఉపాధి హామీ పథకం పనులు బాగున్నాయని పార్లమెంట్‌లో కితాబు ఇచ్చినా రాష్ట్రంలో 16 బృందాలతో తనిఖీలు చేస్తున్నారని తెలిపారు. కొర్రీలను పెడుతూ తెలంగాణలో ఉపాధి హామీ పథకాన్నీ రద్దు చేయాలని కేంద్రం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. మోదీ(Modi) ప్రభుత్వంలో సామాన్య ప్రజలకు బతకడం కష్టంగా మారిందన్నారు. స్మశానవాటికలకు కూడా జీఎస్టీ పెడుతున్నారని... జీఎస్టీ(GST)ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో కంటే ఎక్కువగా 100 లక్షల కోట్లు కేంద్రం అప్పు చేసినా రాష్ట్రంలో ఒక్క జాతీయ ప్రాజెక్టును ఇవ్వలేదని విమర్శించారు. సీబీఐ(CBI), ఈడీ(ED)లతో బెదిరింపులకు గురి చేస్తూ బీజేపీ(BJP) దిగజారుడు రాజకీయాలు చేస్తోందని గుత్తాసుఖేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-07-21T15:47:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising