ఆసిఫ్నగర్లో అర్థరాత్రి యువకుల వీరంగం
ABN, First Publish Date - 2022-06-14T13:24:27+05:30
ఆసిఫ్నగర్లో అర్థరాత్రి యువకుల వీరంగం సృష్టించారు.
హైదరాబాద్: ఆసిఫ్నగర్లో సోమవారం అర్థరాత్రి యువకులు వీరంగం సృష్టించారు. జిర్రా ప్రాంతంలోని రాయల్సీ హోటల్ దగ్గర యువకులు గంజాయి తాగి హల్చల్ చేశారు. గంజాయి మత్తులో వాహనదారులపై దాడులు చేశారు. అక్కడే ఉన్న కొంతమంది యువకులపై, అడ్డుకోబోయిన పోలీసులపై దాడి చేశారు. పోలీసు వాహనంపైకి ఎక్కి నానా హంగామా సృష్టించారు. పలు వాహనాల అద్దాలను యువకులు పగులగొట్టారు. గంజాయి గ్యాంగ్ను అదుపులోకి తీసుకొని పోలీసులు దేహశుద్ధి చేశారు. అజయ్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు యువకులపై కేసు నమోదు చేశారు. గంజాయి తాగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
Updated Date - 2022-06-14T13:24:27+05:30 IST