భూసేకరణ పనులు వేగవంతం చేయాలి : మంత్రి జగదీష్రెడ్డి
ABN, First Publish Date - 2022-05-01T01:14:52+05:30
పట్టణ ప్రాంతాల్లో పార్క్ల నిర్మాణం జరగాలని మంత్రి జగదీష్రెడ్డి తెలిపారు.
యాదాద్రి : పట్టణ ప్రాంతాల్లో పార్క్ల నిర్మాణం జరగాలని మంత్రి జగదీష్రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ప్రభుత్వ భూమి ఉన్న చోట ప్రకృతి వనాలను పెంచాలన్నారు. ఇరిగేషన్ 15, 16 ప్యాకేజిలకు సంబంధించి కాల్వలను పూర్తి చేయాలని ఆదేశించారు. పంట కాల్వల నిర్మాణం, భూసేకరణ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆలేరు, భువనగిరి ప్రాంతాల్లో కాళేశ్వరం నీళ్లు వానాకాలం నాటికి ఇవ్వాలని ఆదేశించారు. కేంద్రం ప్రకటించిన 10 ఉత్తమ గ్రామాల్లో 9 గ్రామాలు మన రాష్ట్రం నుంచే ఉన్నాయని మంత్రి జగదీష్రెడ్డి పేర్కొన్నారు.
Updated Date - 2022-05-01T01:14:52+05:30 IST