ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్టీఆర్, కేసీఆర్ మరవలేని నేతలు: కేటీఆర్

ABN, First Publish Date - 2022-04-27T21:42:51+05:30

ఎన్టీఆర్, కేసీఆర్ మరవలేని నేతలు: కేటీఆర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పాత్రపై తీర్మానం చేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు. చరిత్రలో మరవలేని నేతలు ఎన్టీఆర్, కేసీఆర్ మాత్రమేనని ఆయన కొనియాడారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించి చరిత్ర సృష్టించాచారని గుర్తుచేశారు. కేసీఆర్ హిస్టరీతో పాటు జాగ్రఫీని సృష్టించారని పేర్కొన్నారు. ఎండిపోయిన శ్రీరాంసాగర్‌కు కేసీఆర్ జీవకళ తీసుకొచ్చారని అన్నారు. మన పథకాలను కేంద్రం కాపీ కొడుతోందన్నారు. రైతుబంధు పథకం కేంద్రానికి ప్రేరణ అయ్యిందన్నారు. టీఎస్ ఐపాస్‌లా కేంద్రం సింగిల్ విండో తీసుకొచ్చిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. జనహితమే ధ్యేయంగా తెలంగాణ దూసుకెళ్తుందన్నారు. దేశంలో 24 గంటల కరెంట్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. దేశానికి అన్నం పెడుతున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. మత, కుల పిచ్చిలేని సంక్షేమ దిశలో ముందుకెళ్తున్నామని చెప్పారు. తెలంగాణ ప్రజలు నూకలు తినాలని అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైఫల్యాల చరిత్ర బీజేపీదన్నారు. దేశానికి టెలివిజన్ నాయకుడు కాదు.. విజన్ ఉన్న నాయకుడు కావాలన్నారు. 

Updated Date - 2022-04-27T21:42:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising