ఇంకోసారి అబద్దాలు మాట్లాడితే నాలుక కోస్తాం: మంత్రి కొప్పుల
ABN, First Publish Date - 2022-02-06T23:13:59+05:30
ఇంకోసారి అబద్దాలు మాట్లాడితే నాలుక కోస్తాం: మంత్రి కొప్పుల
హైదరాబాద్: 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు పనులు కళ్లముందే ఉన్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఇక్కడకు వచ్చి బండి సంజయ్ డ్రామా ఆడారని మండిపడ్డారు. బీజేపీ ది మను సంస్కృతి అని ఆయన విమర్శించారు. బీజేపీ దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాలకు వ్యతిరేక పార్టీ అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దళితుల మీద కేసులు పెరిగాయని చెప్పారు. దళిత జాతిని బీజేపీ ఏనాడు పట్టించుకోలేదన్నారు. ఇంకోసారి అబద్దాలు మాట్లాడితే నాలుక కోస్తామని హెచ్చరించారు. బండి సంజయ్ అసలు నీకు మెదడు ఉందా?, సచివాలయం ఏమైనా కేసీఆర్ కోసమా? అని ప్రశ్నించారు. మీరు ఏమి చేసినా అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు ఆగదన్నారు. 368 ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగం సవరించే అవకాశం ఉందన్నారు.
Updated Date - 2022-02-06T23:13:59+05:30 IST