వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి ఖాయం: కిషన్రెడ్డి
ABN, First Publish Date - 2022-04-25T23:59:57+05:30
సింగరేణిని ప్రైవేటీకరణ చేసే ఉద్దేశ్యం కేంద్రానికి లేదని కేంద్రమంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు.
భూపాలపల్లి: సింగరేణిని ప్రైవేటీకరణ చేసే ఉద్దేశ్యం కేంద్రానికి లేదని కేంద్రమంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సింగరేణి ఒడిశాలో బొగ్గు గనులు కొనుగోలు చేస్తోంది.. తెలంగాణలో ఎందుకు కొనడం లేదు? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. బీజేపీ ఎదుగుదలను టీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతుందని కిషన్రెడ్డి తెలిపారు.
Updated Date - 2022-04-25T23:59:57+05:30 IST